మేఘమాల కథతో ఇదో ప్రేమలోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశోక్ చంద్ర, రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య ప్రధాన తారాగణంగా శ్రీ శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై టి.కరణ్‌రాజ్ దర్శకత్వంలో ఎస్.పి.నాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. ఈ చిత్రానికి సంబంధించిన రీ రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కరణ్‌రాజ్ మాట్లాడుతూ- ఓ అందమైన ప్రేమకథగా రూపొందించిన ఈ చిత్రంలో ఓ మేఘమాల కథనం వుంటుందని అన్నారు. ప్రియుడికి ఇచ్చిన మాట కోసం తన వాళ్ళను వదులుకొని ఓ రాతిమనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఆమె కథ తాను రాసుకున్నానని, నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా అందమైన ప్రాంతాలలో షూటింగ్ జరిపారని, ఇందుకోసం నటీనటులు, టెక్నీషియన్ల సహకారం మరువలేనిదని తెలిపారు. ఓ మంచి ప్రమకథా చిత్రంగా ఆదరిస్తారని అన్నారు. సుమన్ ఓ ప్రత్యేక పాత్రలో నటించారని, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం హైలెట్‌గా సాగుతుందని, ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుపుతున్నామని, కొత్త సంవత్సరంలో ఆడియోను, జనవరి చివరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత ఎస్.పి.నాయుడు తెలిపారు.