వర్మ జర్నీలో నాగ్.. అమితాబ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన రామ్‌గోపాల్‌వర్మ చిత్రం ‘వంగవీటి’ డిసెంబర్ 23న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో కార్యక్రమం రోజున విజయవాడలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు వంగవీటి రంగా వర్గీయులు, మరోవైపు రామ్‌గోపాల్‌వర్మ ఎవ్వరూ ఎక్కడా తగ్గలేదు. కొద్దిసేపట్లోనే ఈ గొడవ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చివరికి ఎలాగో వర్మ విజయవాడలో ఆడియో వేడుక పూర్తిచేశాక అంతా సద్దుమణిగింది. మళ్లీ ఇప్పుడు వర్మ హైదరాబాద్‌లో ‘శివ టు వంగవీటి’ అనే ఈవెంట్‌ను జరపాలని నిర్ణయించాడు. ఈ కార్యక్రమానికి ట్యాగ్‌లైన్‌గా ‘జర్నీ ఆఫ్ రామ్‌గోపాల్ వర్మ ఫ్రమ్ విజయవాడ టు నాగార్జున టు అమితాబ్’ అని పెట్టాడు. అంటే తన కాలేజీ జీవితం నుండి మొదటి సినిమా, ప్రస్తుతం అమితాబ్‌తో చేస్తున్న ‘సర్కార్ 3’ వరకూ జరిగిన జర్నీ అన్నమాట. ఈ కార్యక్రమం డిసెంబర్ 20న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని జెఆర్సీ కనె్వన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ వేడుకకు వర్మకు అత్యంత ఆప్తులైన నాగార్జున, అమితాబ్‌బచ్చన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.