టచ్ చేసి చూడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ కథానాయకుడిగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ నేతృత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు రవితేజ జన్మదినోత్సవం సందర్భంగా దర్శక, నిర్మాతలు తెలియజేశారు. రవితేజ ఇమేజ్‌కు తగిన విధంగా వంశీ మంచి కథను తయారుచేశారని, ఫిబ్రవరి మొదటివారంలో షూటింగ్ మొదలుపెడుతున్నామని తెలిపారు. డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు వుంటారని, ఒకరు రాశిఖన్నా అయితే, మరొకర్ని త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు విక్రమ్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రీతమ్స్ అండ్ ఆర్.వెంచర్‌జామ్. కథ:వక్కంతం వంశి, స్క్రీన్‌ప్లే:దీపక్‌రాజ్, మాటలు:శ్రీనివాసరెడ్డి, కెమెరా:ఎం.సుకుమార్, నిర్మాతలు:నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశి, దర్శకత్వం:విక్రమ్ సిరికొండ.