తెరపైకి ‘అతడు అడవిని జయించాడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ తెలుగు రచయిత డా కేశవరెడ్డి నవల ‘అతడు అడవిని జయించాడు’ సినిమాగా రూపొందనుంది. బి.ఎస్.ఎన్. ఫిలింస్ పతాకంపై దూలం సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. పలు నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో రూపొందనున్న ఈ చిత్రం అంతర్జాతీయ సినిమా వేడుకల మీద పోటీపడేలా రూపొందిస్తున్నామని, ఇప్పటికే హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చర్చలు జరిపామని దర్శకుడు దూలం సత్యనారాయణ అన్నారు. తెలుగు సాహిత్యంలో విశిష్ట రచనగా గుర్తింపుపొందిన ఈ నవలకు అంతర్జాతీయ సినిమాగా రూపొందించే సత్తా వుందని, భారీ బడ్జెట్, అత్యాధునిక టెక్నాలజీతో ఆస్కార్, కాన్స్, లొకర్నో, బెర్లిన్, టోరంటో, బుసాన్ లాంటి అంతర్జాతీయ వేదికల పోటీలకు పంపనున్నట్లుగా ఆయన వివరించారు. పలు అంతర్జాతీయ డాక్యుమెంటరీలను రూపొందించిన దూలం సత్యనారాయణకు ఇటీవల తెలంగాణ టూరిజంపై రూపొందించిన ఫిలింకు పోర్చుగల్‌లో ఇంటర్నేషనల్ అవార్డు ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.