మండే ఎండలు గోదారి అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేటెస్ట్‌గా ‘్ధృవ’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న రామ్‌చరణ్ తన తదుపరి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మొదలైంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందించడంవల్ల గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా షూటింగ్ చేయాలని నిర్ణయించారట. దాంతో అక్కడ ఏర్పాటుచేసిన భారీ సెట్టింగుల్లో చిత్రీకరణ జరుగుతోంది. అసలే వేసవికాలం పైగా గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో ఎండల్లో కష్టపడుతూ యూనిట్ షూటింగ్‌ను పూర్తిచేస్తోందట. ఈ విషయాన్ని రామ్‌చరణ్ ట్విట్టర్‌లో తెలుపుతూ మా టీమ్ హార్డ్‌వర్కింగ్ అంతా ఇంతా కాదు అంటూ కామెంట్ పెట్టాడు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ న్యూలుక్‌లో కనిపిస్తాడట. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది.