ప్రేక్షకుల కోసమే మిస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌తేజ్, లావణ్యాత్రిపాఠి, హెబ్బాపటేల్ హీరోహీరోయిన్లుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మించిన ‘మిస్టర్’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిరంజీవి పాల్గొనగా, దిల్‌రాజు, శేఖర్ కమ్ముల, నాగబాబు తదితరులు హాజరయ్యారు. అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ.. ఈ కథ గురించి వరుణ్ నాతో చాలాసార్లు చెప్పాడు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా ఇది. మిక్కీ అన్ని రకాల పాటలకు మంచి మ్యూజిక్ అందిస్తాడు. ఈ నెల 14న విడుదలవుతున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలి అన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. వరుణ్‌తో నేను ఫిదా చిత్రం చేస్తున్నాను. మిస్టర్ సినిమాలో విజువల్స్ బావున్నాయి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని అన్నారు. దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. ఈ వేడుకకు చిరంజీవి రావడం ఆనందంగా వుంది. ఆయనంటేనే నాకు గుర్తుకు వచ్చేది ఖైదీ సినిమా. 34 ఏళ్ళకు ముందు ఖైదీతో సంచలనం సృష్టించి, మళ్లీ 34 ఏళ్ల తరువాత మరో ఖైదీతో తన సత్తా చాటుకున్నారు. ఆయన ఎప్పుడూ ప్రేక్షకుల హృదయాల్లో జీవితఖైదీ. ఇక ఈ చిత్రాన్ని నాకు సక్సెస్ కావాలని చేయలేదు. ప్రేక్షకుల కోసమే ఈ సినిమా చేశాను. నాకు నిర్మాతలు ఎంతో సహకారం అందించారు. గోపీమోహన్, శ్రీ్ధర్ సీపాన అందించిన డైలాగులు ఆకట్టుకుంటాయి. మిక్కీ అద్భుతమైన పాటలు ఇచ్చాడు. వరుణ్‌తేజ్ కొత్తగా కనిపిస్తాడు అన్నారు.