ముగ్గురు భామలతో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన 150వ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నాడు చిరంజీవి. ఈ చిత్రం 100 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది. తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇస్తూ తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆయన 151వ చిత్రానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ పూర్తికావచ్చింది. దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ముగ్గురిలో అనుష్క, నయనతార, ఐశ్వర్యారాయ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటకే అనుష్కతో మంతనాలు జరిపారని, ఈ సినిమా చేయడానికి ఆమె సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నయనతార, ఐశ్వర్యలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని, బాహుబలి స్ఫూర్తితో తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఉయ్యాలవాడ కథ అయినా కూడా కమర్షియల్ హంగులతో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న భారీగా ప్రారంభిస్తారట. అదేరోజు ఫస్ట్‌లుక్‌తోపాటు హీరోయిన్ల పేర్లను ప్రకటిస్తారని తెలిసింది. చాలా రోజుల తరువాత చిరంజీవి ముగ్గురు హీరోయిన్లతో చిందేయనున్నాడు.