పూరి జగన్నాథ్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అతనొక్కడే’, ‘పటాస్’ చిత్రాలతో ప్రామిసింగ్ కథానాయకుడిగా నిరూపించుకున్న నందమూరి కల్యాణ్‌రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నె.8గా రూపొందనున్న ఈ భారీ చిత్రాన్ని కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రంపై ఇప్పటికై అంచనాలు నెలకొన్నాయి. కథానాయకుడి కోసం దర్శకుడు మంచి కథను సిద్ధం చేశారని, ఏప్రిల్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. నందమూరి ఆర్ట్స్ పతాకంపై ప్రిస్టేజియస్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే కూడా పూరి జగన్నాథ్ అందిస్తుండడం విశేషం. త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని నందమూరి కల్యాణ్‌రామ్ ప్రకటించారు.