'క్లాప్' కొట్టు గురూ!

అప్పుడే భారీ పారితోషికమా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

....అంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు నవతరం కథానాయిక సాయి పల్లవి అత్యాశను చూసి. ఎదుగుతున్న నటికి ఆశ వుండాలే కానీ, మరీ ఇంత అత్యాశ పనికిరాదని కూడా వాపోతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘్ఫదా’తో అందరి అభిమానాన్ని చూరగొనడమేగాక, తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా యువతరం మనసుల్ని తన నటనతో కొల్లగొట్టేసి, తన వైపునకు తిప్పుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం యువ హీరో నానితో ‘ఎంసీఏ’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం విడుదలైతే సాయి తన రెమ్యూనరేషన్‌ను మరింత పెంచడం ఖాయం అని అంటున్నారంతా. నటన ఒక్కటే కాదు, చదువులోనూ సాయి పల్లవి తక్కువేం కాదు. ఎంబిబిఎస్ చేసిన ఈ తమిళ భామ కార్డియాలజీలో పి.జి చేస్తానంటోంది. అయితే అడుగు పెడుతూనే నటిగా మంచి పేరుని, అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి తన పారితోషికాన్ని ఇంత తక్కువ కాలంలో పెంచేయడం గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయం గురించి సాయి పల్లవిని అడిగితే- ‘‘బాగా డబ్బు సంపాదించి ఏదో అయిపోవాలని నేను పరిశ్రమలో అడుగుపెట్టలేదు. నా పాత్రకు ఎలాంటి రెమ్యూనరేషన్ ఇచ్చుకోవాలో అది నిర్మాతలకు తెలుసు. నేను అప్పుడే పారితోషికాన్ని పెంచానంటూ వినిపిస్తున్న రూమర్స్‌కు అర్థంలేదు. మంచి ప్రాతల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులకు మరింతగా చేరువకావాలన్నదే నా ఆలోచన. అంతకు మించి నేను మరొకటి ఆలోచించను’’అంటూ ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చింది. అదీ..సంగతీ!

-సమీర్