కుంభకోణంలో బాలయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కుంభకోణంలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ జరుగుతున్న భారీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతోపాటు పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం అంతా పాలుపంచుకుంటోంది. బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటించనుండగా, మరో నాయికగా నటాషా దోషి ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కల్యాణ్ మాట్లడుతూ- ‘సెనే్సషనల్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఆయన 102వ చిత్రాన్ని నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ఎం.రత్నం అద్భుతమైన కథను అందించారు. ‘శ్రీ రామరాజ్యం’, ‘సింహ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ సరసన నయనతార నటిస్తుండడం విశేషం. రాంప్రసాద్‌గారు ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలలు నిర్వర్తించనుండగా, బాలయ్య 100వ చిత్రమైన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి సంగీత సారథ్యం వహించి చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించిన చిరంతన్‌భట్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చనుండడం విశేషం. ఆర్‌ఎఫ్‌సిలో భారీ సెట్‌ను నిర్మించాం. ఆగస్టు 3 నుండి 30 రోజులపాటు ఇక్కడ చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ కుంభకోణంలో మొదలైంది. ఆదివారం నుంచి బాలకృష్ణ సెట్‌లో అడుగుపెట్టారు’’ అన్నారు. బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణరెడ్డి, స్టంట్స్: అరివుమణి, అంబుమణి, కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్‌భట్, నిర్మాణం: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి., దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.