ఆ సంఘటనలతోనే మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదర్శ చిత్రాలయ ప్రైవేటు లిమిటెడ్ సత్యా ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో ఆది కథానాయకుడుగా భారీఎత్తున రూపొందిన చిత్రం ‘మలుపు’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ 19న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ తన పెద్ద కుమారుడు సత్యప్రభాస్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించామని, ఉన్నతమైన సాంకేతిక విలువలతో నిర్మించామని చెప్పారు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథను రాసుకున్నానని, అన్ని కొత్తతరహా సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయని, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఏం జరిగింది అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని, ఆ కీలకమైన సన్నివేశాలే చిత్రంలో హైలెట్‌గా ఉంటాయని దర్శకుడు సత్యప్రభాస్ తెలిపారు. తన గత చిత్రాల కన్నా కొత్తకథాంశంతో రూపొందిందని, తెలుగులో వచ్చిన ‘వైశాలి’ చిత్రం కన్నా హిట్ అవుతుందని ఆది పినిశెట్టి వెల్లడించారు. మిధున్ చక్రవర్తి, నిక్కిగల్ రాణి, రీచాపల్లోడ్, పశుపతి, నాజర్, కిట్టి, హరీష్ ఉత్తమన్ తదితరుల నటించిన ఈ చిత్రానికి సంగీతం : ప్రసన్, ప్రవీణ్, శ్యామ్, కెమెరా : షణ్ముక సుందరం, పాటలు : రామజోగయ్య శాస్ర్తీ, భువనచంద్ర. నిర్మాత : రవిరాజ పినిశెట్టి, దర్శకత్వం : సత్యప్రభా పినిశెట్టి