4న రానున్న ఓ మల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రమ్యశ్రీ కథానాయికగా నటించి, దర్శకత్వం వహించి రూపొందించిన చిత్రం ‘ఓ మల్లి’. ఆర్.ఎ. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బి.ప్రశాంత్ రూపొందించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మార్చి 4న విడుదలకు ముస్తాబౌతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు రమ్యశ్రీ మాట్లాడుతూ ఓ గ్రామంలోని యువతి యధార్ధ కథను ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, సినిమా ఔట్‌పుట్ బావుండాలని రెండు సంవత్సరాలపాటు యూనిట్ సభ్యులందరూ కష్టపడ్డారని, చివరికి ఓ మంచి చిత్రాన్ని తీశామన్న సంతృప్తి కలిగిందని తెలిపారు. సందేశాత్మకమైన కథాకథనాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆమె అన్నారు. రమ్యశ్రీ నటన హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో పాటలకు ఇప్పటికే మంచి ఆదరణ లభించిందని, కెమెరా పనితనం హైలెట్‌గా సాగుతుందని, ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని నిర్మాత ప్రశాంత్ అన్నారు. ఆకాష్, ఎల్బీశ్రీరామ్, శ్రీ్ధర్, వేణు, సాయి, విజయవాణి, బెనర్జీ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: వి.నాగిరెడ్డి, కెమెరా: కె.దత్తు, సంగీతం: సునీల్‌కాశ్యప్, నిర్మాత: బి.ప్రశాంత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమ్యశ్రీ బి.