సహజనటిని అనిపించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అందాల ముద్దుగుమ్మ అదాశర్మ. ఆ తరువాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్’ చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా ఆదితో కలిసి గరంగరంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రానుంది. మదన్ దర్శకత్వంలో రూపొందిన గరం సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 12న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ అదా శర్మ చెప్పిన వివరాలు..
కళ్ళతోనే నటించా
హార్ట్‌ఎటాక్ సినిమా చూసి మదన్‌గారు ఈ సినిమాకోసం సంప్రదించారు. హార్ట్‌ఎటాక్‌లో కూడా ఎమోషనల్ సీన్స్ చాలా ఉంటాయి. కళ్ళతోనే ఎక్కువగా నటించాను. ఆ రోల్ మదన్‌గారికి బాగా నచ్చింది. ఇక ఈ సినిమాలో ముస్లిం యువతి పాత్రలో కనిపిస్తాను. మొదటిసారిగా ఇలాంటి పాత్రలో నటించాను. ఈ సినిమాలో నాకు చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. ఎక్కువగా కళ్ళతోనే నటించాను. ఎన్నో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయి.
సెటిల్డ్ యాక్టర్ అనిపించుకోవాలి..
ముస్లిం యువతి పాత్రలో నటించడానికి రిఫరెన్స్‌గా మణిరత్నంగారి సినిమాను తీసుకున్నాను. ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన డైరెక్ట్ చేసిన ‘బొంబాయి’ సినిమాలో మనీషాలా నటించడానికి ప్రయత్నించాను. సినిమాటోగ్రాఫర్ కూడా నన్ను చాలా బాగా చూపించారు. బాబ్లీ హీరోయిన్‌గా ఒక ముద్ర వేయించుకోవాలని లేదు. సెటిల్డ్‌గా, సహజంగా నటించే నటిగా పేరు తెచ్చుకోవాలనుంది.
డాన్స్ బాగా చేశాను
నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో పెద్దగా డాన్స్ చేయడానికి స్కోప్ దొరకలేదు. కాని ఈ సినిమాలో మొత్తం ఐదు పాటల్లో నాలుగు పాటలకు డాన్స్‌చేశాను. ‘చిలకపాప’ అనే మసాలా సాంగ్‌కి డాన్స్ చేయడం చాలా బాగా అనిపించింది. అలాగే ఈ గరం ప్రేమ, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.
నచ్చితే ఏ పాత్ర అయినా...
‘సన్నాఫ్ సత్యమూర్తి’లో చిన్న పాత్ర అని చూడలేదు. నాకు త్రివిక్రమ్, బన్నీలతో కలిసి నటించాలనిపించింది. ఆఫర్ రాగానే చిన్న పాత్ర.. పెద్ద పాత్ర అని చూడలేదు. వెంటనే ఒప్పేసుకున్నాను. నామీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు. నా సంతోషమే నాకు ముఖ్యం. నన్ను సంతోషపరిచే ఏ పాత్రలో అయినా నటిస్తాను. నా మొదటి సినిమా ‘1920’లో హారర్ పాత్రలో నటించాను. ఆ సినిమాలో గ్లామర్ రోల్‌లో నటించాను. ఇప్పటివరకు ఫలానా పాత్రలో అదా బాగా నటిస్తుందనే ముద్రపడలేదు. నాకు కూడా ఒక పర్టిక్యులర్ పాత్రకు మాత్రమే స్టిక్ అవ్వాలని లేదు. నటిగా అన్ని పాత్రల్లో నటించగలగాలి.
ఆది బాగా కష్టపడతాడు
ఆదితో ఇది నా మొదటి సినిమా. సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్. సినిమాకోసం నేనే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తా.. అనుకుంటే ఆది నాకంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడు. సుప్రీలీ టాలెంటెడ్ పర్సన్. తను మంచి ఫాదర్ కూడా.
ప్రేమికుల రోజున
ఈసారి ప్రేమికుల రోజుకి ప్రత్యేకమైన ప్లానింగ్ ఏం లేదు. 10వ తారీఖున మా అమ్మ వస్తోంది. తనతో కల్సి ‘గరం’ సినిమా చూడాలి.
ఖాళీగా ఉంటే..
నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. రైట్ టైంలో మంచి డాన్స్ వస్తే ఖచ్చితంగా పాడతాను. అలానే మిమిక్రీ కూడా చేస్తాను. ఖాళీగా ఉంటే పెయింటింగ్ వేస్తాను.. మూవీస్ చూస్తాను.. బుక్స్ చదువుతాను.
పీరియాడిక్ సినిమాలో బేసికల్‌గా నేనొక కథక్ డాన్సర్‌ని. కథక్ డాన్స్ ఉన్న ఒక పీరియాడిక్ ఫిలింలో నటించాలనుంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్...
ప్రస్తుతం తెలుగులో ‘క్షణం’ సినిమాలో నటిస్తున్నాను. హిందీలో కొన్ని టాక్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాను.

-శ్రీ

మార్చి 4న దండకారణ్యం

స్నేహా చిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్.నారాయణమూర్తి, విక్రమ్, ప్రసాద్‌రెడ్డి, త్రినాథ్ ప్రధాన పాత్రల్లో నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం ‘దండకారణ్యం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘త్రేతాయుగంలో సీతారాములను, ద్వాపరయుగంలో పాండవులకు ఆశ్రయం కల్పించిన ఈ దండకారణ్యం కలియుగంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. ప్రభుత్వం చేపట్టే గనులు, బాక్సైట్ తవ్వకాల వలన ఆదివాసీయుల మనుగడ లేకుండాపోతుంది. పర్యావరణమంతా సర్వనాశనం అయిపోతుంది. రాజ్యాంగంలో ఆదివాసీయుల హక్కులను ఉల్లంఘించి ప్రభుత్వం ఈ పనులను చేపడుతుంది. వారి హక్కులకోసం చర్చించే చిత్రమే ఈ దండకారణ్యం. మూలవనరులు మూలవాసీయులకే చెందాలి. విదేశీపాలు కాకూడదు. ఇందులో మొత్తం ఏడు పాటలుంటాయి. గద్దర్ మూడు పాటలను పాడారు. వందేమాతరం శ్రీనివాస్ నాలుగు పాటలను రాశారు. గోరటి వెంకన్న, కాశీపతి, ములుగు తిరుపతి వంటి ప్రజాకవులు ఈ సినిమాకు సాహిత్యం అందించారు. ఈ సినిమాలో ఉద్యమకారుడు కోటన్న పాత్రలో నటించాను. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది. ఈనెల 20న పాటలను విడుదలచేసి, మార్చి 4న సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, ఆపరేటివ్ కెమెరామెన్: నాగేష్‌బాబు, కథ, చిత్రానువాదం, మాటలు, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, నిర్మత, దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి.