10న ఒక్కడు మిగిలాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు మనోజ్ కథానాయకుడిగా పద్మజా ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. ఈ చిత్రాన్ని ఈనెల 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. సినిమా గురించి హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ, శ్రీలంకలో జరిగిన కథనాన్ని బేస్ చేసి తయారు చేసుకున్న కథ ఇది కాదని, బాధలలో వున్న ప్రతి ఒక్కరి కోసం ఈ సినిమా నిర్మించారని తెలిపారు. శ్రీలంకనుంచి ఇక్కడికి వస్తే అక్కడి వారంటున్నారని, అక్కడికి వెళితే ఇక్కడివారంటున్నారని మొత్తానికి శరణార్ధులకు ఓ దేశమే లేదా అన్న పాయింట్‌తో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. స్క్రిప్టుకు గౌరవం ఇవ్వాలని, చాలా జాగ్రత్తం అందరి కలిసి రూపొందించామని అన్నారు. ఇలాంటి సినిమా చేయడం సామాన్య విషయం కాదని, కథానాయిక అనీషా ఆంబ్రోస్ అన్నారు. ఏడాదికిపైగా ఈ చిత్రం గూర్చి ట్రావెల్ అవుతున్నామని ఎక్కువ రోజులు సముద్రంలో షూటింగ్ చేసామని, అందరికీ నచ్చుతుందని నిర్మాత ఎస్.ఎన్.రెడ్డి అన్నారు. ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో మిలింద్ గుణాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ నటించారు.