అమ్మాయిలంతే అదోటైపు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాయత్రి రీల్స్ పతాకంపై గోపీ వర్మ, మాళవికా మీనన్, శివాజీరాజా ప్రధాన తారాగణంగా కృష్ణమ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అమ్మాయిలంతే.. అదోటైపు’. డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- అమ్మాయిలలోని ఎమోషనల్ యాంగిల్‌ను, తండ్రి తనయల రిలేషన్‌ను హైలెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. తాను తీసుకున్న తొందరపాటు నిర్ణయంవల్ల ఓ కూతురు తండ్రి ప్రేమకు దూరమైతే ఆ తరువాత జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్రమని తెలిపారు.
శివాజీరాజా ప్రధాన పాత్రలో నటించారని, త్వరలోనే ఆడియో విడుదల చేయనున్నామని ఆయన అన్నారు. సాయి, భద్రమ్, వేణుగోపాల్, భరత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:శ్రీనివాస్, ఎడిటింగ్:గోపీ సింధం, పాటలు:పూర్ణాచారి, దర్శకత్వం:కృష్ణమ్.