దర్పణం షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ పతాకంపై వి.రామకృష్ణ దర్శకత్వంలో వి.ప్రవీణ్‌కుమార్ యాదవ్, వెంకట్ యాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘దర్పణం’. తనిష్క్‌రెడ్డి, అలెక్సియస్, శుభాంగి పంత్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటను పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- కథ ఎంతగానో నచ్చి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఎటువంటి ఆటంకం లేకుండా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తిచేశామని, అరకు, వైజాగ్ తదితర లొకేషన్‌లలో పాటల చిత్రీకరణ జరిగిందని తెలిపారు. డిసెంబర్‌లో ఆడియోను విడుదల చేసి జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని వారు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:సిద్ధార్థ్ సదాశివుని, కెమెరా:సతీష్ ముత్యాల, ఎడిటింగ్:ఇ.ఎస్.ఈశ్వర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.రామకృష్ణ.