డార్క్ కామెడీ నేపథ్యంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాయత్రి గుప్త, శే్వతావర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో రెడ్ యాంట్స్ బేనర్‌పై తెరకెక్కుతున్న ‘మిఠాయి’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి విజయ్ దేవరకొండ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో దర్శకులు క్రాంతి మాధవ్, సందీప్ వంగా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ, డార్క్ కామెడీ నేపథ్యంలో రూపొందే సినిమా ఇది. ఈ తరహా చిత్రాలు తెలుగులో తక్కువగా వచ్చాయి. మంచి టీమ్‌తో పనిచేస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చేలా వుంటుందన్నా రు. శే్వతావర్మ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రోజున ఈ చిత్రాన్ని ప్రారంభించడం ఆనందంగా వుంది. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్‌కు ధన్యవాదాలు అన్నారు. గాయత్రి మాట్లాడుతూ, సినిమా అంటే పాషన్ వున్న వ్యక్తులు కలిసి చేస్తున్న సినిమా ఇది. విలక్షణ కథ, కథనంతో సాగుతుందన్నారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడు తూ, ఈ సినిమాకు పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ నాకు చాలా కాలంగా తెలుసు. దర్శకుడు ప్రశాంత్ మంచి మిత్రుడు. మం చి కానె్సప్ట్‌ను ఎంచుకున్నాడు. ఈ టీమ్‌కు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నానని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం-వివేక్‌సాగర్, కెమె రా-సాకేత్ సౌరబ్, ఎడిటింగ్-వీనుభూషణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్-కృష్ణ వోడపల్లి, నిర్మాత దర్శకత్వం-ప్రశాంత్‌కుమార్.