మెగా అతిథిగా ‘ఛలో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకి కుడుముల దర్శకత్వంలో ఉషా మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బేనర్‌పై శంకర్‌ప్రసాద్ మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘్ఛలో’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఈనెల 25న జరగనున్నది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ, ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పాటలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈనెల 25న మెగాస్టార్ ముఖ్య అతిథిగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో చేయనున్నాం. చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదల చేస్తామన్నారు. దర్శకుడు వెంకి మాట్లాడుతూ, టెక్నికల్ అంశాలు హైలెట్‌గా నిలిచే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగశౌర్య నటన కొత్తగా వుంటుంది. తన కెరీర్‌లో ఈ చిత్రం నిలిచిపోతుంది. తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం అన్నారు. నరేష్, పోసాని, రఘుబాబు, వెనె్నల కిషోర్, మైమ్‌గోపి, ప్రవీణ్, సత్య, వైవాహర్ష, ప్రగతి తదితరులు నటిస్తున్నారు.