‘జై సింహా’ విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, నటాషా దోషి నటించిన చిత్రం ‘జై సింహా’. నిర్మాత సి.కల్యాణ్, కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్‌లో డిస్ట్రిబ్యూటర్స్ పార్థసారధిరెడ్డి, శివారెడ్డి, ఫణి, శక్తి పిక్చర్స్, రమేశ్, విజయ్, మహేశ్, కృష్ణ తదితరులు పాల్గొని సినిమా సక్సెస్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ- ‘జై సింహ’ సినిమా 50 కోట్ల క్లబ్‌లో చేరింది. నేను గతంలో కల్యాణ్‌తో ‘పరమవీరచక్ర’ సినిమా చేశాను. ఆ సినిమాకు నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చింది. ఇపుడు ‘జై సింహా’ మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ సక్సెస్‌తో అందరూ సంతోషంగా ఉన్నారు. నాకు రికార్డులు ముఖ్యం కాదు. పరిశ్రమ బాగుండాలి. కె.ఎస్.రవికుమార్‌తో సినిమా చేయాలనేది ఎనిమిదేళ్ల కల ఈ సినిమాతో నెరవేరింది. ఇందులో మాటలు, పాటలు, సంగీతం అన్నీ చక్కగా కుదిరాయి. అందుకే ఈ సినిమా సాధించింది.