అవును..వీళ్లు దేశముదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోసాని కృష్ణమురళి, పృథ్వీరాజ్, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘దేశముదుర్స్’. ఇద్దరూ 420గాళ్ళే అనేది ఉప శీర్షిక.. ఎం.కె.్ఫలిమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కన్మణి దర్శకత్వంలో కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పులిగుండ్ల సతీష్‌కుమార్, వద్దినేని మలయాద్రి నాయుడు సమర్పకులు. ఈ సినిమా వివరాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘పోసాని, పృథ్వీగారు ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రల్లో కనిపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలోంచి పుట్టిన సినిమా ఇది. వాళ్లిద్దరు తెరపై కాసేపు కనిపిస్తేనే నవ్వుకుంటాం. అలాంటి నటులు సినిమా అంతా నవ్విస్తే ఇంకేస్థాయిలో నవ్వులు పువ్వులు పూస్తాయో చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి పాత్రల్లో ఎండింగ్ టైమ్‌లో వచ్చే పెర్ఫామెన్స్ బాగుంటుంది. కథకు హారర్ టచ్ కూడా ఇచ్చాం. అర్జున్ మంచి పెర్ఫామర్. ఆ పాత్రలో సన్నివేశాలు కన్నీరు పెట్టిస్తాయి. షూటింగ్ పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. మేలో సినిమా విడుదలచేస్తాం’ అని అన్నారు. నిర్మాత కుమార్ మాట్లాడుతూ.. ‘దర్శకులు మంచి అవుట్‌పుట్ తీసుకొచ్చారు. ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను నవ్విస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. మిగతా పనులు కూడా పూర్తిచేసి మే రెండవ వారంలో గానీ, మూడవ వారంలోగానీ సినిమా విడుదల చేస్తాం. ప్రేక్షకులంతా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా’అని అన్నారు. సంగీత దర్శకుడు యాజమాన్య మాట్లాడుతూ.. ‘నాకీ బ్యానర్‌లో తొలి సినిమా ఇది. పాటలు బాగావచ్చాయి. చక్కని కామెడీ ఎంటర్‌టైనర్. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, డి.ఓ.పి: అడుసుమిల్లి విజయ్‌కుమార్, ఎడిటర్: గౌతంరాజు, నిర్మాత: కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కన్మణి.