అరుదైన గౌరవం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఆయనకు లండన్లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపుబొమ్మను ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్లో కరణ్ జోహార్ అంటే ఓ బ్రాండ్. ఆయన బ్యానర్ నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలు, ప్రేక్షకులతోపాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇప్పటివరకూ ఇండియన్ సినిమాకు సంబంధించి నటీనటులకు మాత్రమే దక్కిన ఈ గౌరవం మొదటిసారి ఓ దర్శక నిర్మాతకు దక్కడం విశేషం. షారుక్, అమితాబ్, ఐశ్వర్యారాయ్, కరీనా, దీపిక, ప్రభాస్ల మైనపు విగ్రహాలు ఏర్పాటుచేశారు. 1998లో వచ్చిన ‘కుచ్ కుచ్ హోతాహై’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన కరణ్ జోహార్, రచయితగా, నిర్మాతగా కూడా తన సత్తాను చాటుకుని బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నాడు.