దేశంలో దొంగలు పడ్డారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖయూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృధ్వీరాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో సారా క్రియేషన్స్‌పై గౌతమ్‌రాజ్‌కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్, కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంతర పనులు తుది దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయింది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ.
హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలెట్ చేస్తూ తెరకెక్కించాం. ఇప్పుడు సమాజంలో జరుగుతోన్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ కథను తెరకెక్కించాం. సినిమా బాగా వచ్చింది. ఆర్‌ఆర్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మే ద్వితీయార్థంలో టీజర్ రిలీజ్ చేసి, జూన్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన కార్తికేయ మాట్లాడుతూ- కథకు తగ్గ మంచి నటీనటులు కుదిరారు. ఔట్‌పుట్ బాగా వచ్చింది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు. గిరిధర్, జబర్దస్త్ రాఘవ, వినోద్, తడివేలు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శేఖర్ గంగనమోని, సంగీతం: శాండీ, ఎడిటింగ్: మధు.జి రెడ్డి, నిర్మాత: కరుణాకర్.