త్రినేత్రి షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడవెల్లి రాంరెడ్డి సమర్పణలో లక్షిత ఆర్ట్స్ పతాకంపై తిరుపతి కె.వర్మ దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్‌రెడ్డి, కాచిడి గోపాల్‌రెడ్డి నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం త్రినేత్రి. మేఘన, ఆరోహి, వృశాలి ముఖ్య తారాగణంతో పోసాని కృష్ణమురళి కీలక పాత్రలో తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు ఎడవెల్లి వెంకట్‌రెడ్డి, కాచిడి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘లక్షిత ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ చిత్రానికి త్రినేత్రి అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టాం. మా సినిమాలో పోసాని కృష్ణమురళి చేయటం మా అదృష్టం. వారికి , ఇతర నటీనటులకి మా కృతజ్ఞతలు. పోసానిగారు మా సినిమా కథ విని కథ చాలా బాగుంది. ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది అని అన్నారు. సినిమా షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల, కరీంనగర్ వంటి వాస్తవిక లొకేషన్‌లలో షూటింగ్ చేశాం. నిర్మాణానంతర కార్యక్రమాలలో బిజీగాఉంది. త్వరలోనే టీజర్‌ను విడుదలచేస్తాం’అని తెలిపారు. దర్శకుడు తిరుపతి కె.వర్మ మాట్లాడుతూ ‘ఇది ఆడవారికి సంబంధించిన సినిమా. ప్రతి ఒక్క మహిళా చూడదగ్గ సినిమా. ఇవాళ సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. ఆడవాళ్లు తిరగబడితే ఎలా ఉంటుంది అన్నదే కథ. మా త్రినేత్రి సినిమా అందరినీ అలరిస్తుంది. పోసాని కృష్ణమురళిగారు కీలక పాత్రలో చేస్తున్నారు. వారి పాత్ర ఈ సినిమాకి హైలెట్‌గా ఉంటుంది. మేఘన, ఆరోహి, వృశాలి, పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ అప్పారావు, జయవాణి, కుమార్‌వర్మ, చంద్రం, రమేష్‌వర్మ, కాచిడి గోపాల్‌రెడ్డి, శ్యాం, అసిఫ్, విక్రమ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడవెల్లి వెంకట్‌రెడ్డి, కాచిడి గోపాల్‌రెడ్డి నిర్మాతలు. వారు నా కథ విని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు వారికీ నా ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదలచేస్తాం’అని తెలిపారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వి.వి.ఎస్.చారి, రచయత: హర్ష, సంగీతం: జయంత్, పాటలు: అడ్డిచర్ల సాగర్, మండిగం రాము, ఎం.శ్రావణ్.