20న నాకూ.. మనసున్నది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుజయ్, చంద్రకాంత్, తనిష్క, రష్మీ, సోని ముఖ్యపాత్రల్లో రాజశేఖర్ దర్శకత్వంలో సాయి హాసిని ప్రొడక్షన్స్ పతాకంపై నానే్చరి దేవాశంకర్‌గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘నాకూ.. మనసున్నది’. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 20న విడుదలకానున్న సందర్భంగా సోమవారం ఫిలిం ఛాంబర్‌లో ట్రైలర్ విడుదలైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రతాని రామకృష్ణగౌడ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సాయి వెంకట్, దర్శకుడు సిరాజ్‌లతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ- చందమామ కథలాంటి సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. చిత్రం పూర్తయి చాలా రోజులు అవుతున్నా విడుదల విషయంలో పెద్ద టెన్షన్‌గా మారింది. విడుదల కోసం చాలామంది దగ్గరికి తిరిగాను. అలాంటి సమయంలో నిర్మాత సాయి వెంకట్ ఈ సినిమా గురించి తెలుసుకుని నాకు సపోర్టు అందించారు. ఒక దెయ్యం మనిషిని ప్రేమిస్తే ఎలా వుంటుందన్న ఆసక్తికరమైన కథాంశంతో సాగే సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది అన్నారు. ఆర్‌కె గౌడ్ మాట్లాడుతూ- ఈ రోజుల్లో చిన్న సినిమాలు విడుదల కావడమనేది చాలా కష్టంగా మారింది. అందుకే త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రత్యేక చానల్‌ను చిన్న సినిమాల కోసం ఏర్పాటుచేస్తోంది. సాటిలైట్ ద్వారా చిన్న సినిమాలకు మంచి అవకాశం ఇది. ఇక ఈ సినిమా ట్రైలర్ బాగుంది, తప్పకుండా మంచి విజయం సాధించాలి అన్నారు. నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ- దర్శకుడు రాజశేఖర్ చేసిన ప్రయత్నం బాగుంది. ప్రతి ఒక్కరు చిన్న సినిమాల విషయంలో సపోర్టు చేస్తే మంచి సినిమాలు ఎన్నో వస్తాయి అన్నారు. చిత్ర నిర్మాత శంకర్ గౌడ్ మాట్లాడుతూ మా దర్శకుడు మంచి కథతో అద్భుతంగా తెరకెక్కించాడు. తప్పకుండా మా ప్రయత్నాన్ని ఆదరిస్తారన్న నమ్మకం ఉంది అన్నారు. సతీష్, నవ్వుల వినోద్, వెంకట్, అప్పారావు జూ.ఐరెన్‌లెగ్ శాస్ర్తీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్ శంకర్, కెమెరా: వెంకీ పెద్దాడ, ఎడిటింగ్: శ్రీచందు, నిర్మాత: నానే్చరి దేవాశంకర్‌గౌడ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రాజశేఖర్.