‘అంతకుమించి’ ట్రైలర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.జె.్ఫలింస్ పతాకంపై రూపుదిద్దుకున్న చిత్రం ‘అంతకుమించి’. జై, రష్మీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు సతీష్ గాజుల, ఎ.పద్మనాభరెడ్డి, సహ నిర్మాతలు భానుప్రకాష్ తేళ్ల, కన్నా. హర్రర్ థ్రిల్లర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జానీ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు చూడని సరికొత్త పాత్రలో రష్మీని చూడబోతున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు రెడీ అయిన ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అంతకుమించి ట్రైలర్ చాలా ఇంప్రెస్ చేసింది. ట్రైలర్ చూశాక ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా? అని నాకే అనిపిస్తుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. ‘మా ట్రైలర్‌ను సుకుమార్‌గారి చేతులమీదుగా విడుదల చేసినందుకు ఆనందంగా వుంది. మేము అడగగానే మా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసినందుకు సుకుమార్‌గారికి మా చిత్ర టీం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రస్తుతం సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తవ్వగానే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. హీరో జై మాట్లాడుతూ.. ‘‘ముందుగా సుకుమార్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ చిత్రంలో మధ్యతరగతి యువకుడి పాత్రలో నటించాను. మన చుట్టుపక్కల చూసే ఓ సాదాసీదా కుర్రాడిగా కనిపిస్తాను. సహజంగా నటించే అవకాశమున్న పాత్ర. రష్మీతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె పాత్రకు తగ్గకుండా నా క్యారెక్టరైజేషన్ ఉంటుంది. రష్మీ సహకారం మర్చిపోలేను. అందరం కథపై నమ్మకంతో ఉన్నాం. దర్శకుడు జానీ కథను మరింత బాగా తెరకెక్కించారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్మకంతో వున్నాం’’ అన్నారు. దర్శకుడు జానీ మాట్లాడుతూ... ‘‘దర్శకుడిగా నాకు తొలి చిత్రమిది. నా తొలి చిత్ర ట్రైలర్‌ని సుకుమార్‌గారు విడుదల చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. గతంలో హార్రర్ తరహా కథలు చాలా చూశాం. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు సహా అందరి పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. మంచి సాంకేతిక నిపుణుల సహాయంతో అనుకున్న సమయానికి అనుకున్నట్లు చిత్రీకరణ జరిపాం. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు. హీరో జై, హీరోయిన్ రష్మీలకు గుర్తుండిపోయే చిత్రమవుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు. సూర్య, మధునందన్, రవిప్రకాష్, అజయ్‌ఘోష్, జెమినీ సురేష్, టీవీ9 హర్ష, వంశీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: కరుణాకర్, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి, స్టంట్స్: రామ్‌సుంకర, సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటర్: క్రాంతి, మాటలు: మోహన్ చందా.