విక్రమ్ తనయుడితో శేఖర్ కమ్ముల సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది వరుణ్‌తేజ్, సాయిపల్లవిలు జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘్ఫదా’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సుమారు 40 కోట్ల కలెక్షన్స్‌ను సాధించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత శేఖర్‌కమ్ముల ఇంతవరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. సినిమా హిట్ అయినా కూడా ఏడాదిగా ఎదురుచూస్తున్న ఈ దర్శకుడికి తాజాగా హీరో దొరికాడట. అయితే ఆయన తెలుగు హీరో కాదు. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్‌విక్రమ్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారట శేఖర్ కమ్ముల. ఈ వార్తలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ధృవ్ తమిళ భాషలో ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ‘వర్మ’ చిత్రంతో తమిళ తెరకు పరిచయం అవుతున్నాడు.