దండకారణ్యంపై చర్చ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్.నారాయణమూర్తి, విక్రమ్, ప్రసాద్‌రెడ్డి, త్రినాధ్ ప్రధాన పాత్రల్లో నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘దండకారణ్యం’. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. సుద్దాల అశోక్ తేజ ప్లాటినమ్ డిస్క్‌లను చిత్ర బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, నారాయణమూర్తి కాలం వంటివాడని, ఎవరికీ లొంగకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూంటాడని అన్నారు. ఈ సినిమాలో సమాజంలో వున్న సమస్యలతోపాటు తల్లీబిడ్డల బంధాన్ని కూడా వివరించాడని చెప్పారు.
గద్దర్ మాట్లాడుతూ, సామాజిక ప్రయోజనం కోసం ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ఇప్పటివరకు నారాయణమూర్తి చేసిన అన్ని సినిమాలకంటే ఇదొక రికార్డుగా చెప్పుకోవచ్చన్నారు. ఆయన ఇలానే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాలి అని చెప్పారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టే గనులు, బాక్సైట్ తవ్వకాలవలన ఆదీవాసీయుల మనుగడ లేకుండా పోతోందని, పర్యావరణమంతా సర్వనాశనం అయిపోతోందని, రాజ్యాంగంలో ఆదీవాసీల హక్కులను ఉల్లంఘించి ప్రభుత్వం ఈ పనులను చేపడుతుందన్నారు. వారి హక్కుల కోసం చర్చించే చిత్రమే ఈ ‘దండకారణ్యం’ అన్నారు. ఈ చిత్రం ఆడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోందని, సాహిత్యాన్ని అందించి పాటలు పాడిన ప్రజాకవి గద్దర్‌కు, వందేమాతరం శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు అన్నారు. దండకారణ్యంలో ఎలాంటి మారణహోమం జరగకుండా హోమాలు జరిపించాలని, దండకారణ్యం గురించి కూడా పార్లమెంట్‌లో చర్చలు జరగాలి అని అన్నారు.రు. ఇంకా ఈ కార్యక్రమంలో వందేమాతరం శ్రీనివాస్, గోరేటి వెంకన్న, యశ్‌పాల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.