సదువు తక్కువ సోకులెక్కువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్ర ఆర్ట్స్ పతాకంపై అన్నం చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాలేజ్ పోరగాళ్ళు’. ‘సదుపు తక్కువ సోకులెక్కువ’ ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో మల్లికార్జున, కవిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కెమెరామెన్ శ్రీ్ధర్ నేతృత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రాంబాబు మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలోని పాటలను ఇటీవల ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి టీవీ9లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాటలన్నీ నేను విన్నాను. అద్భుతంగా వున్నాయి. ఈ చిత్రం ట్రైలర్ కూడా చాలా బాగుంది. పాటలు బాగున్నట్లుగానే ఈ చిత్రం కూడా అద్భుతంగా వుండి మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాను. నేటి యువతకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని దర్శకుడు అన్నం చంద్రశేఖర్ అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం యూనిట్ మొత్తానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అన్నారు. చిత్ర దర్శకుడు అన్నం చంద్రశేఖర్ మాట్లాడుతూ- ఈ చిత్రంలోని పాటలని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేయడం ఆనందంగా ఉంది. పాటలన్నీ అద్భుతంగా వున్నాయని అందరూ చెబుతున్నారు. మా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చుకు వెనుకాడకుండా మా వెన్నంటి వుండి మా యూనిట్‌కి కావాల్సినవి వెంటనే సమకూర్చారు. ఈ చిత్రం బాగా వచ్చింది. నేటి యువతకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని ఈ కాలేజ్ పోరగాళ్ళు చిత్రం ద్వారా చేసాం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. మల్లికార్జున్, కవిత మెహతో, టింకు, పవన్, సునీల్, శ్రీను చౌహాన్, స్వప్న, ప్రియ, శిరీష్, చరణ్‌నాయుడు, మల్లేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రమేష్, ఎడిటింగ్: రాజు, సంగీతం: ఎం.ఎల్.ప్రేమ్, నిర్మాత: మంత్ర ఆర్ట్స్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: అన్నం చంద్రశేఖర్.