ప్రభాస్ త్రిభాషా చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్ర పరిశ్రమలో గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌ది ప్రత్యేక స్థానం. అలాంటి గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌లో సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిభాషా చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జరిగాయి. గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌లో కృష్ణంరాజు సమర్పణలో.. వరుస సూపర్‌హిట్స్ అందిస్తున్న యువి క్రియేషన్స్‌తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘జిల్’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్ అందించిన కె.కె.రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. పూజాహెగ్డే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించనుంది. త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కె.కె.రాధాకృష్ణ దర్శకత్వంలో నేను నటించబోయే త్రిభాషా చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు ప్రభాస్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న సాహో చిత్రాన్ని అత్యధిక బడ్జెట్‌తో హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇపుడు బిల్లా తర్వాత ప్రభాస్ హీరోగా గోపీకృష్ణా మూవీస్ నిర్మిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గకుండా నిర్మించేందుకు గోపీకృష్ణా ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించబోయే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉండనుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ- ఈరోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూశాను. ఈరోజు ప్రభాస్ నటించే ఈ చిత్రం గోపీకృష్ణా మూవీస్ కృష్ణంరాజు ఆఫీసులో ప్రారంభమైంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే చేయబోతున్నాం అన్నారు.