జీతూజోసఫ్‌తో కార్తీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కడై కుట్టి సింగం’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న తమిళ హీరో కార్తి, ప్రస్తుతం దేవ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం సెట్స్‌మీద వుండగానే ఇపుడు తాజాగా మరొక సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మలయాళంలో ‘దృశ్యం’ అనే బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పిన కథ కార్తికి నచ్చడంతో వెంటనే ఓకె చెప్పాడట. ఈ చిత్రాన్ని కార్తి అన్నయ్య సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు వయాకామ్ 18 సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయట. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే జీతూ జోసెఫ్‌కు తమిళంలో ఇది రెండవ సినిమా అవుతుంది. ఇంతకుముందు ఆయన అక్కడ కమల్‌హాసన్‌తో దృశ్యంను పాపనాశనం పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. ఇక ఈ చిత్రం తెలుగులో దృశ్యం పేరుతో రీమేక్ అయ్యింది. ఆ చిత్రంలో విక్టర్ వెంకటేష్, మీనా జంటగా నటించారు.