వీడు నచ్చే బేవర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చితం బేవార్స్. ఎస్‌ఎస్ కె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాతలు పొన్నాల చందు, ఎంఎస్ మూర్తి, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న చిత్రం ఈనెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఫిలిం ఛాంబర్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సినిమా 12న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. రాజేంద్రప్రాద్ పాత్ర హైలెట్‌గా సాగుతుంది. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవార్స్ కాదు, పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులూ బేవార్సేనన్న కానె్సప్టుతో సినిమా రూపొందించారు. మ్యూజిక్ బాగుంటుంది. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ తన మనసు, ప్రాణం పెట్టి రాసిన ‘తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా..’ పాట అద్భుతం. హీరో హీరోయిన్లు బాగా చేశారు. తప్పకుండా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు. హీరో సంజోష్ మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్‌తో పని చేయడం అదృష్టం. తండ్రీ కొడుకు కలిసి ఈ సినిమా చూడాలి. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రంగా ప్రశంసలు పొందుతాం. ఇప్పటికే ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది అన్నారు. హీరోయిన్ హర్షిత మాట్లాడుతూ ఇంత మంచి సబ్జెక్టుతో తెరకెక్కిన సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా మంచి ఇమేజ్ వస్తుందని నమ్ముతున్నానన్నారు.