చిత్రీకరణలో దండుపాళ్యం-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజాగాంధీ, రఘుముఖర్జీ ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన ‘దండుపాళ్యం’ చిత్రం సంచలనం సాధించడంతో దానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం-2’ చిత్రం గురువారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కర్నాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ హెచ్.డి.గంగరాజు, ఎం.ఎన్.సురేష్‌లు పాల్గొన్నారు. అనంతరం దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ, దండుపాళ్యం సక్సెస్ తరువాత దానికి సీక్వెల్ చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా వెంటనే చేయలేకపోయామని, ఆ సినిమా కోసం వివరాలు సేకరిస్తున్నపుడు క్రైంలో కూడా ఇంత పెద్ద స్పాన్ ఉంటుందా అని షాక్ అయ్యానన్నారు. ఫస్ట్‌పార్ట్ వెనుక వున్న కథను ఈ చిత్రంలో చూపిస్తున్నామని అన్నారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ, దండుపాళ్యం చిత్రానికి సీక్వెల్ చేయడం ఆనందంగా వుందని, ఈ చిత్రం కన్నడంలోనే కాకుండా తెలుగులో కూడా సంచలన విజయం సాధించిందని, ‘దండుపాళ్యం-2’ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నామని, ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల చేస్తామన్నారు.