యానిమేషన్ విందుతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్‌ఎస్ మూర్తి స్వీయ దర్శకత్వంలో అల్లు వంశీ, షిప్రాగౌర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. చిత్రానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. అనంతరం రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘సినిమా పరిశ్రమతో సంబంధం మూర్తి, మంచి కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించే ఉద్దేశ్యంతో నిర్మాత, దర్శకుడిగా మారి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అన్నారు. యానిమేషన్ తరహా చిత్రం అందరికీ కొత్త అనుభూతి అందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత, దర్శకుడు ఎన్‌ఎస్ మూర్తి మాట్లాడుతూ యానిమేషన్ రంగంలో అనుభవాన్ని సంపాదించి, సొంత బ్యానర్‌పై కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు. మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేశామని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందన్నారు. హీరో అల్లు వంశీ మాట్లాడుతూ డిఫరెంట్ కానె్సప్ట్‌తో తెస్తోన్న చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. హీరోయిన్ షిప్రాగౌర్ మాట్లాడుతూ కథ చెప్పినప్పుడు ఆమితాసక్తి కలిగిందని, షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా అన్నారు. 24న వైజాగ్‌లో షూట్ ప్రారంభమవుతుందన్నారు. మంచి కానె్సప్ట్ చిత్రానికి డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు హ్యాపీగా ఉందని సంగీత దర్శకుడు జిజె కార్తికేయన్ అన్నారు.

చిత్రం..అల్లు వంశీ, షిప్రాగౌర్