దిల్ రాజు మరో మల్టీస్టారర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో చాలాకాలంగా ఆగిపోయిన మల్టీస్టారర్ సినిమాలకు కొత్త ఉత్తేజాన్ని నింపాడు నిర్మాత దిల్‌రాజు. మహేష్, వెంకటేష్‌లాంటి హీరోలను పెట్టి తీసిన సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తెలుగులో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కాయి.. తెరకెక్కుతున్నాయి కూడా. తాజాగా ఆయన బ్యానర్‌లో మరో మల్టీస్టారర్ కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈమధ్యే సమ్మోహనం లాంటి సూపర్ హిట్ అందుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథా చర్చలు జరిగాయి. సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారట. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉంటుందని టాక్. మరి ఆ ఇద్దరు హీరోలు ఎవరన్నది చూడాలి. దిల్‌రాజు తాజాగా నిర్మిస్తున్న హలో గురు ప్రేమకోసమే చిత్రం రేపు విడుదలకానుంది. మరోపక్క వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో కలిసి ఎఫ్ 2 సినిమా చేస్తున్నాడు దిల్ రాజు.

బంగార్రాజుపై ఫోకస్
టాలీవుడ్ కింగ్ నాగార్జున హిందీలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. చాలాకాలం తరువాత హిందీలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర. రణబీర్‌కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్న చిత్రంలో నాగ్ 600 ఏళ్లనాటి పాత్రలో కనిపించనుండటం గమనార్హం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరిగింది. అక్కడ తన పాత్రకు సంబంధించిన షూట్ పార్ట్ పూరె్తైందని నాగ్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. ఇక నాగార్జున తదుపరి సినిమా బంగార్రాజుపై ఫోకస్ పెట్టనున్నాడు. ఇప్పటికే కళ్యాణ్‌కృష్ణ కురసాల దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దాంతోపాటు మరో సినిమా కోసం స్క్రిప్ట్ వినడానికి నాగార్జున సిద్ధమైనట్టు సమాచారం. నాగ్ ఇటీవలే నానితో కలిసి చేసిన దేవదాస్ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో కాస్త అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. అందుకే ఈసారి మంచి కమర్షియల్ హిట్ కొట్టాలన్న ఆలోచనలో ఉన్నాడు. సో నాగ్ ఇండియా రాగానే బంగార్రాజుపై ప్రకటన వచ్చే అవకాశం లేకపోలేదు.

మీ టూని అలా వాడొద్దు..
జాతీయ సినీ పరిశ్రమలో దుమారం రేపుతోన్న అంశం -లైంగిక వేధింపులు. లైంగిక వేధింపులను ఎదుర్కొన్న పలువురు సెలబ్రిటీలు మీ టూ స్ఫూర్తితో ధైర్యంగా గొంతు విప్పుతున్నారు. దీంతో బాలీవుడ్‌లో పేరున్న పెద్దలకు తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటికే ఒకప్పటి, ఇప్పటి హీరోయిన్ల ఘాటు వ్యాఖ్యలతో పరిశ్రమలోని ప్రముఖుల పేర్లు బయటికి వస్తున్నాయి. దీనిపై మాత్రం హీరోయిన్ రకులు భిన్నమైన స్పందనను వ్యక్తం చేస్తోంది. బాధితుల్లోని కొందరి తీరు చూస్తుంటే, పాపులార్టీ కోసం కావాలనే పనిగట్టుకుని వ్యాఖ్యలు చేస్తున్నట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. మీ టూ ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్తూనే, కొందరు మాత్రం కావాలని పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో చిత్రమైన, జిగుప్సాకరమైన వ్యాఖ్యలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రగులుకున్న మీ టూ స్ఫూర్తి చల్లారిపోయే పరిస్థితి తేవొద్దని హితవు పలుకుతోంది. అయితే తానెప్పుడూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని స్పష్టం చేసింది.