మొదలైన మొనగాడెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా ఆర్ట్స్ బ్యానర్‌పై వాడపల్లి జగన్నాథం సమర్పణలో వాడపల్లి రాజు, దావల రాజ్‌కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘మొనగాడెవరు’. ‘హు ఈజ్ నెం.1’ ట్యాగ్‌లైన్. ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కుమార్ రాజేంద్ర దర్శకుడు. రాజ్ వాడపల్లి, వంశీకృష్ణ, ప్రియా అగస్టీన్, కావ్య కీర్తిబండారి హీరో హీరోయిన్లు. ముహూర్తపు సన్నివేశానికి శివాజీరాజా క్లాప్ కొట్టగా బి.గోపాల్ కెమెరా స్విచ్చాన్‌చేశారు. ప్రతాని రామకృష్ణాగౌడ్ గౌరవ దర్శకత్వం వహించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ లోగో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. దర్శకుడు కుమార్ రాజేంద్ర మాట్లాడుతూ ‘పల్లెటూరు నుంచి ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్లు కావాలని, ఇద్దరు హీరోల్లో ఒకరు దర్శకుడు, ఒకరు హీరో కావాలని వస్తారు. అయితే ఇండస్ట్రీలో ఎదగడం అంత సులభం కాదని తెలుసుకుని ఎలా కష్టపడ్డారు. చివరకువారు సక్సెస్ సాధించారా? అనేదే కథ. దీంతోపాటు సమాంతరంగా సినిమాల్లో ఇప్పటివరకు నటించిన ఆర్టిస్టులు చిత్తూరు నాగయ్య నుంచి ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ ఇలా అందరి హీరోల నుండి ఇప్పటి చిన్న హీరోవరకు ఎలా ఇండస్ట్రీలోకి వచ్చి ఎదిగారనే కానె్సప్ట్ బయోపిక్స్‌లా ఉంటాయి అన్నాడు. నిర్మాతలు మాట్లాడుతూ ‘దర్శకుడు చెప్పిన కథ బావుంది. కొత్త కానె్సప్ట్ మూవీ అవుతుందని చెప్పగలను. సినిమావాళ్ల కష్టాలను ఈ సినిమాలో చూపిస్తాం. సినిమాలో సినిమాగా సినిమా రన్ అవుతుంది. ఈ సినిమాలో వచ్చిన లాభాల్లో సగ భాగం పేద సినీ కళాకారులకు అందిస్తాం’ అన్నారు.