కవచం.. ఓ రొమాంటిక్ థ్రిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అందాల తారలు కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరోయిన్లుగా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ యువ నిర్మాత నవీన్ శొంఠినేని(నాని) రొమాంటిక్ థ్రిల్లర్ కవచం. డిసెంబర్‌లో సినిమా విడుదల కానుంది. ఈ చిత్ర టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. హీరో సాయి శ్రీనివాస్, హీరోయిన్లు కాజల్, మెహ్రీన్ సంయుక్తంగా కవచం టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ- మంచి కంటెంట్ బేస్డ్ మూవీ చెయ్యాలని 50 కథలు విన్నాం. అందులో శ్రీనివాస్ చెప్పిన ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది. రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు కథ, కథనం చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. చోట నా ఫస్ట్ మూవీకి వర్క్ చేశారు. మళ్లీ ఈ సినిమా చేయడం వెరీ హ్యాపీ. నాతో సినిమా తియ్యాలని నిర్మాత నాని ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నాడు. కాజల్ నా ఫేవరేట్ నటి. ఆమెతో ఇంకా రెండు చిత్రాలు చేస్తున్నాను. మెహరీన్ ఒక కీ రోల్‌లో నటించింది. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ థాంక్స్ అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ మాట్లాడుతూ- నన్ను నమ్మి నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సురేష్‌కి, మా హీరో సాయికి నా స్పెషల్ థాంక్స్. అలాగే మా నిర్మాత నాని, శాంతయ్యకి నా థాంక్స్. హీరో, నిర్మాత నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కాన్ఫిడెంట్‌గా చెపుతున్నాను అన్నారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ- ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్టు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ చిత్రం. స్టోరీ విని చాలా ఎగ్జయిట్ అయ్యాను. పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ వున్న క్యారెక్టర్‌లో నటించాను. సాయి అమేజింగ్ టాలెంట్ వున్న హీరో. డైరెక్టర్ శ్రీనివాస్ చాలా అందంగా ఈ చిత్రాన్ని తీశారు అన్నారు. మెహరీన్ మాట్లాడుతూ టీజర్ చాలా బాగా నచ్చింది. ఈ చిత్రంలో నేను పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది అన్నారు.