మైసూర్‌కు సైరా పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి 151వ చిత్రం సైరా నర్సింహారెడ్డి తదుపరి షెడ్యూల్ మైసూర్‌లో జరగనున్నట్టు ఇండస్ట్రీలో టాక్. చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు మైసూర్‌లాంటి చారిత్రక నగరంలో చిత్రీకరిస్తే మంచిదని దర్శకుడు సురేందర్ రెడ్డి భావిస్తున్నాడట. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి టైటిల్ పాత్రను చిరంజీవి పోషిస్తుంటే, ఆయన గురువుగా అమితాబ్ కనిపించనుండటం తెలిసిందే. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ సంగీతం అందిస్తున్న చిత్రంలో నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై హీరో రామ్‌చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సైరా వచ్చే సమ్మర్‌కు థియేటర్లకు రావొచ్చని అంచనా.