విలన్ కాదట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమర్ అక్బర్ ఆంటోనీ తరువాత మాస్ మహరాజా రవితేజ యువ దర్శకుడు వీఐ ఆనంద్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే స్క్రిప్ట్ విషయంలో రవిజేత పునరాలోచనలో పడ్డాడని, దాంతో ప్రాజెక్టు నిలిచిపోయిందన్న వార్తలూ వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ వార్తలన్నీ రూమర్లేనట. రవితేజ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా నిరాశ పరుస్తుండటంతో తన కొత్త సినిమా విషయంలో ఏమాత్రం చాన్స్ తీసుకోదలచుకోలేదట. స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయమని దర్శకుడు వీఐ ఆనంద్‌కు సూచించాడట రవితేజ. దీంతో రవి సూచించిన మార్పులను చేసే పనిలో వీఐ ఆనంద్ బిజీగా ఉన్నాడు. స్క్రిప్ట్ రిపేర్లు పూర్తికాగానే సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారట. సినిమా ఆగిపోయిందనే రూమర్లకు చెక్ పెడుతూ త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలని ఫిల్మ్‌మేకర్లు ప్లాన్ చేసినట్టు ఇండస్ట్రీ టాక్.
అయితే, సినిమా విషయంలో చెలరేగిన మరో రూమర్‌కూ తాజాగా క్లారిటీ వచ్చేసింది. ‘సవ్యసాచి’ చిత్రం కోసం విలనిజాన్ని పండించిన మాధవన్, మరోసారి రవితేజ చిత్రంలో విలనిజాన్ని చూపించనున్నాడన్న టాక్ ఇంతకుముందు నడించింది. దీనికి చెక్ పెడుతూ మాధవన్ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చాడు. దీనిపై వస్తోన్న కథనాలను రీట్వీట్ చేస్తూ రవితేజ సినిమాలో నటిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నాడు. ప్రస్తుతం మాధవన్ ‘జీరో’లో కనిపించనున్నాడు. షారూక్‌తో ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన చిత్రంలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌లు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 21న విడుదలకానున్న ‘జీరో’లో సల్మాన్‌ఖాన్, కాజోల్, రాణీ ముఖర్జీ, శ్రీదేవి, ఆలియా భట్, కరిష్మా కఫూర్, దీపికా పదుకొనె తదితరులు అతిథి పాత్రల్లో అలరించనున్నారు.