పేట.. కోట దాటేదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజనీకాంత్ లీడ్‌రోడ్ చేసిన చిత్రం ‘పేట’. సిమ్రన్, త్రిష హీరోయిన్లు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకుడు. అశోక్ వల్లభనేని నిర్మాత. సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అంబికా కృష్ణ, జెమిని కిరణ్, వైవీయస్ చౌదరి, ప్రసన్నకుమార్ ఫస్ట్ టికెట్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్మాత అశోక్ వల్లభనేని మాట్లాడుతూ ‘పేటను సొంతంగా విడుదల చేయడానికి తీసుకున్నా. ఫస్ట్‌డేకి వచ్చిన టాక్‌తోనైనా సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇస్తారని ఆశిస్తున్నా. కార్యక్రమానికి హాజరైన శ్రీకాంత్, వైవీయస్ చౌదరి, జెమిని కిరణ్, ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ, అనిరుథ్, హీరోయిన్లకు కృతజ్ఞతలు. యువీ క్రియేషన్స్, దిల్‌రాజు, అల్లు అరవింద్ వంటి నిర్మాతలు థియేటర్లతోనే పుట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. థియేటర్లు ఇవ్వడానికి చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వారికి బుద్ధిచెప్పి ప్రభుత్వాలు అందరికీ థియేటర్లు దక్కేలా చేయకపోతే, పరిశ్రమ కుదేలైపోవడం ఖాయం. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఆలోచించాలి’ అని కోరారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘అశోక్ వల్లభనేని నా స్నేహితుడు. ధైర్యం ఎక్కువ. ఇటీవలే సర్కార్ విడుదల చేశారు. ఈ సంక్రాంతి బరిలో పేటను విడుదల చేస్తున్నారు. పోటీ పడగలదన్న నమ్మకం కలుగుతుంది’ అన్నారు. చిరంజీవి, రజనీలాంటి ఆర్టిస్టులు చిన్న ఆర్టిస్టులకు స్ఫూర్తి అన్నారు. అంబికాకృష్ణ మాట్లాడుతూ జపాన్‌లో తొలిసారి ఫ్యాన్ బేస్ సాధించిన దక్షిణాది హీరో రజనీ. ఆయన సినిమాలు, స్టైల్ చూస్తూ పెరిగాం. వల్లభనేని విడుదల చేస్తున్న పేట, పండుగ సీజన్‌లో తన సత్తా చాటుతుందన్న భావన కలుగుతోంది. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ మంచి దర్శకుడు. కాలక్షేపానికి కాకుండా, హాంటింగ్ చేసే సినిమాలను తీస్తాడు. దమ్మున్న చిత్రానికి కార్తీక్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ తొలి సినిమా పిజ్జాను తెలుగులోనూ ఆదరించారని గుర్తు చేసుకున్నాడు. తలైవా సినిమా కోసం హైదరాబాద్‌కు వచ్చానని, ఇది అందరికీ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు. సన్ పిక్చర్స్‌కి ధన్యవాదాలు చబుతూ, అశోక్ సినిమాను తెలుగులో విడుదల చేయడం హ్యాపీగా ఉందన్నారు. స్ట్రాంగ్ స్టోరీ, పైగా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎంటర్‌టైనర్ అన్నారు. రజనీ సరికొత్త మొమెంట్స్ ఇందులో ఉంటాయని, హెవీ కాంపిటీషన్ మధ్య ఫెస్టివల్ సినిమాగా నిలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు.