ప్రశ్నించేవాడే.. హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీష్‌బాబు హీరోగా రాజా వనె్నంరెడ్డి దర్శకత్వంలో జనం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.సత్యారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రశ్నిస్తా’. అక్షిత, హసీస్, షిప్రాకౌర్ హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ఉగాది కానుకగా ఏప్రిల్ 6న విడుదలవుతుంది. వెంగీ సంగీతం అందించిన చిత్రంలోని పాటలకి శ్రోతలనుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి, నటులు రావురమేష్, వేణుగోపాల్, హీరో మనీష్‌బాబు, హీరోయిన్ అక్షిత, పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ, సంగీత దర్శకుడు వెంగి, ఫైట్‌మాస్టర్ నందు, నిర్మాత పి సత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ సత్యారెడ్డి కథకుడు, దర్శకుడు, నిర్మాత. ఆయన మంచి సినిమాలు తీశారు. ఇప్పుడు వారి అబ్బాయిని హీరోగా పెట్టి రాజా వనె్నంరెడ్డిమీద వున్న నమ్మకంతో ప్రశ్నిస్తా సినిమా తీశారు. హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ మనీష్‌లో వున్నాయి. సాంగ్స్ ట్రైలర్స్ బాగున్నాయి. చెడుకి వ్యతిరేకంగా మహిళలు ఎదురుతిరిగి పాలకులను ప్రశ్నిస్తే ఎలా వుంటుందనేది చిత్ర కథ అని భావిస్తున్నా. సినిమా పెద్దహిట్ అయి మనీష్‌బాబు స్టార్ హీరో అవ్వాలని ఆశిస్తున్నా అన్నారు.
నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ ఉగాది కానుకగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. సినిమాని ఆదరించి ఆశీర్వదించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు రాజావనె్నంరెడ్డి మాట్లాడుతూ రావురమేష్, హీరో మనీష్ క్యారెక్టర్స్ రెండూ పోటాపోటీగా ఉంటాయి. యాక్షన్, రియాక్షన్ కరెక్టుగా వున్నప్పుడే పాత్రలు హైలెట్ అవుతాయి. నిర్మాత నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా చిత్రం తీశాను. వేంగి మ్యూజిక్ సుద్దాల అశోక్‌తేజ పాట సినిమాకి ప్లస్ అయ్యాయి అన్నారు.