ఇప్పుడు ఓకేనట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి మణిరత్నం అనుకున్నట్టే జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా తెస్తున్న చిత్రానికి అనుష్క గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కల్కి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ పుస్తకం ఆధారంగా మణిరత్నం సినిమా చేయడానికి సిద్ధపడటం తెలిసిందే. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న చిత్రంలో కోలీ, టాలీ, మాలీ, బాలీవుడ్ నటులు సందడి చేయబోతున్నారు. అమితాబ్‌బచ్చన్, విక్రమ్, ఐశ్వర్యరాయ్, విజయ్ సేతుపతి, జయం రవి, కీర్తిసురేశ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించనున్నారని వినికిడి. మద్రాస్ టాకీస్, లైకాప్రొడక్షన్ సంస్థలు సినిమాను నిర్మిస్తాయి. ఎఆర్ రెహమాన్ బాణీలు సమకూరుస్తున్నారు. అయితే ఇందులోని ఓ పాత్రకు ముందు మణిరత్నం స్వీటీని తీసుకోవాలనే అనుకున్నాడట. తరువాత స్క్రీన్ మీదకు నయనతార వచ్చింది. సినిమా చేసేందుకు నయన్ సైతం దాదాపు ఓకే చెప్పేసింది. అయితే విజయ్, రజనీకాంత్ ప్రాజెక్టులతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో, మణికి అదే విషయాన్ని చెప్పేసిందట. దీంతో మళ్లీ అనుష్కనే సంప్రదించాడు మణి. అప్పుడు కాదన్న స్వీటీ, ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ‘భాగమతి’ తర్వాత అనుష్క ‘సైలెన్స్’ ప్రాజెక్టు చేస్తుంది. ఇందులో మాధవన్, అంజలి, సుబ్బరాజు, షాలినిపాండే కీలక పాత్రధారులు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.