ప్లాటినమ్‌లో వీరి వీరి గుమ్మడిపండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్ర, వెనె్నల, సంజయ్ ప్రధాన పాత్రల్లో ఎం.వి.సాగర్ దర్శకత్వంలో శివాకృతి క్రియేషన్స్ పతాకంపై కెల్లం కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వీరి వీరి గుమ్మడిపండు’ చిత్ర ప్లాటినమ్ డిస్క్ వేడుకలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు మధురా శ్రీ్ధర్ చిత్ర బృందానికి ప్లాటినమ్ డిస్క్‌లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పనిచేసే కిరణ్, సినిమాలమీద వున్న పాషన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని, సినిమాలో పాటలన్నీ కథ ప్రకారంగా సాగుతాయని, మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, తప్పకుండా ఈ సినిమా యూనిట్‌కు మంచి సక్సెస్‌ను ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. దర్శకుడు ఎం.వి.సాగర్ మాట్లాడుతూ, ఇదొక ఫ్యామిలీ హారర్ ఎంటర్‌టైన్ చిత్రమని, కొత్త ఆర్టిస్టులతో చేశామని, పి.ఆర్. మంచి సంగీతాన్ని అందించారని అన్నారు. సినిమాను అందరి సపోర్టుతో అనుకున్న విధంగా తెరకెక్కించామని, డిసెంబర్ 18న విడుదల చేస్తామన్నారు. నిర్మాత కెల్లం కిరణ్‌కుమార్ మాట్లాడుతూ, సినిమాకి మంచి మ్యూజిక్ కుదిరిందని, పాటలు హిట్ అవడంతో ప్లాటినమ్ డిస్క్ వేడుకలు జరుపుతున్నామని, అలాగే రీరికార్డింగ్ కూడా బాగుంటుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రం అవుతుంది అన్నారు.