ఆంధ్రప్రదేశ్‌

పులివెందుల చర్చిలో జగన్ క్రిస్మస్ ప్రార్థనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల : కడప జిల్లా పులివెందులలోని సిఎస్‌ఐ చర్చిలో శుక్రవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, భార్య వైఎస్.్భరతి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి, కడప ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ఉదయం చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు జగన్ పేర్కొన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కోసి కుటుంబ సభ్యులు, హాజరైన వారికి పంచిపెట్టారు. అనంతరం క్రిస్మస్ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చికి వచ్చిన మహిళలను ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.