తెలంగాణ
అవగాహన లేక అవాస్తవాలు ప్రచారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 August 2019
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అవగాహన లేక విద్యుత్ సంస్థలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 71 మెగావాట్ల సోలార్ పవర్ ఉండేదని, అది ఇపుడు 3,600 మెగావాట్లకు పెరిగిందని అన్నారు. ఛత్తీస్గడ్ నుంచి రూ.3.90 పైసలకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రూ.4.30 పైసలకు కొనుగోలు చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎన్నడూ చెప్పలేదని అన్నారు. విద్యుత్ సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని, వాటిపై ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేవని అన్నారు. పీపీఏలు రాత్రికి రాత్రే కుదుర్చుకున్నామనటంలో వాస్తవం లేదు అని అన్నారు.