జాతీయ వార్తలు

సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి
పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్‌ నేతలు గలాం నబీ ఆజాద్‌, మల్లికార్జున్‌ ఖర్గే, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేయనున్నారని వదంతులు వినవస్తున్నాయి. కాగా ఈసార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కొన్ని రాష్ట్రాల్లో ఖాతానే తెరువలేదు. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడ ప్రియాంకాగాంధీ ప్రచారం చేసినా సోనియాగాంధీ ఒక్కరే గెలిచారు.ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే యూపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ రాజీనామా చేశారు. ఒడిశా పీసీసీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ కూడా తన పదవి నుంచి తప్పుకున్న విషయం విదితమే.