కృష్ణ

అన్ని రంగాల్లో మనమే అగ్రస్థానంలో నిలవాలి:వైవిబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, నవంబర్ 29: నవ్యాంధ్రప్రదేశ్‌లో అందరూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని శాసనమండలి సభ్యుడు వై.వి.బి రాజేంద్రప్రసాదు అన్నారు. స్థానిక ఎజి అండ్ ఎస్‌జి సిద్ధార్థ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం నుంచి జరగనున్న పైకా జిల్లా స్థాయి ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రసంగిస్తూ విద్యలో, క్రీడలలో జాతీయ స్థాయిలో మనమే అగ్రస్థానంలో నిలవాలని, అందుకు గ్రామీణ యువత ముందుకు రావాలని, తెలుగు జాతి సత్తాను జాతీయ స్థాయిలో చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి తోడ్పాటునందించాలని కోరారు. పోటీల్లో వెయ్య, రెండు వేల మీటర్ల పరుగు పందాలు, లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు.