క్రైమ్/లీగల్

బీజేపీ ఎంపీ సుజనాపై ఎస్పీకి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 11: రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాల్సిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతూ, వారిలో భయాందోళనలు రేకెత్తే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ విశాఖ జిల్లా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ జిల్లా ఎస్పీకి శనివారం ఫిర్యాదు చేశారు. ఈ దేశంలో ఎవరూ బతకలేకపోతున్నారు, ఈ దేశంలో బతికే కంటే ఇతర దేశంలో కాందిశీకులుగా వెళ్లండి. ఈ దేశంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయంటూ ఉద్రేక పూరితంగా ఎంపీ సుజనా చౌదరి చేసిన ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని పేర్కొన్నారు. కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం, ఆర్థిక, రాజకీయ, సామాజిక లబ్ధికోసం దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఉద్దేశ పూర్వకంగా ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమని, భారత జాతిని అవమాన పరిచే రీతిలో చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు కాపీని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు పంపినట్టు అమర్ నాథ్ చెప్పారు.
'చిత్రం... బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై విశాఖ జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీకి ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే అమర్‌నాథ్