క్రైమ్/లీగల్

స్టీల్ పరిశ్రమలో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 13: జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని జయరాజ్ స్టీల్ పరిశ్రమలో పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులకు గాయాలైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బిహార్ రాష్ట్రానికి చెందిన సురేశ్ సింగ్ (50) సూరారం కాలనీ, సాయిబాబా నగర్‌లో భార్య, పిల్లలతో నివాసం ఉంటున్నాడు. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని జయరాజ్ స్టీల్ పరిశ్రమలో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే సెకండ్ షిప్ట్‌లో విధులకు వచ్చిన సురేశ్ సింగ్ ఆదివారం రాత్రి క్రేన్ నడుపుతుండగా బాయిలర్ ఆకస్మాత్తుగా పేలింది. భయబ్రాంతులకు గురైన కార్మికులు పరుగులు తీశారు. పేలుడు దాటికి అందులోని వేడి నీళ్లు మీద పడి పనిచేస్తున్న కార్మికులు ముకేశ్ నారాయణ చౌదరి(35), యాదవేందర్ సింగ్(38)కు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.