క్రైమ్/లీగల్
తనిఖీల్లో ఆభరణాలు సీజ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 January 2020
వికారాబాద్, జనవరి 14: పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వెండి ఆభరణాలు, నగదును సీజ్ చేశారు. ఈ సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణానికి చెందిన జ్యూవలెరీ వ్యాపారి మురళీకృష్ణ సోమవారం హైదరాబాద్ నుంచి తాండూరుకు కారులో వెళ్తున్నాడు. అనంతగిరి ఘాట్ రోడ్డులోని కెరెళ్లి చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. తనిఖీల్లో మురళీకృష్ణ కారులో రూ.50వేలు నగదు, రూ.2.20 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసినట్లు సీఐ తెలిపారు.