క్రైమ్/లీగల్

కారులో చోరీ కేసు ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, జనవరి 23: పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగలగొట్టి చోరీ చేసిన కేసులో నిందితుడ్ని గన్నవరం పోలీసులు అరెస్టు చేసి అతని నుండి 18.86 లక్షల రూపాయల విలువ నగదు, బంగారు ఆభరణాలతో సహా 8 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కె శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం రాత్రి సీసీఎస్ పోలీసులు గస్తీ తిరుగుతుండగా గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని చినవుటపల్లి రావ్‌ఫిన్ ప్లాట్‌ల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అర్జ ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు పార్కింగ్ చేసిన మోటార్ సైకిళ్ళను, కారు అద్దాలు పగలగొట్టి దొంగిలించిన నగదు, ఓ వృద్ధురాలిని బెదిరించి బంగారు నగలు అపహరించినట్లు వెల్లడించాడు. అతని వద్ద నుండి పది కేసుల్లో 18.86 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పెనమలూరు మండలం వణుకూరుకి చెందిన ప్రభాకర్ అత్తగారి ఊరైన ఉంగుటూరులో ఇల్లు అద్దెకు తీసుకుని భార్య బిడ్డలతో నివాసం ఉంటూ నేరాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌లో 3, కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో 2, పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో 2, విజయవాడ గవర్నర్‌పేట పీఎస్‌లో 1, ఆత్కూరులో1, నూజివీడు టౌన్ పీఎస్‌లో పది కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు.